నిమ్స్లో హ్యాండ్ రిహాబిలిటేషన్ క్లినిక్ ప్రారంభం
పంజాగుట్ట, వెలుగు: నిమ్స్దవాఖానలో శనివారం హ్యాండ్ రిహాబిలిటేషన్ క్లినిక్ ను ప్రారంభించారు. చేతి గాయాలు, నరాలు దెబ్బతినడం, టెండాన్, కాలిన గాయాలు, జన్యుపరమైన లోపాలు, శస్త్రచికిత్సల అనంతరం చేతి పనితీరు కోల్పోయిన పేషెంట్లకు ఈ క్లినిక్ ద్వారా సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొ.బీరప్ప తెలిపారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, అడిషనల్పీసీసీఎఫ్సునీత ఎం.భగవత్, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ విభాగం హెచ్ వోడీ పార్వతి, సీనియర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.