ఫ్రీ బస్ అంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నరు.. మహిళలు ఎదిగితే BRS ఓర్వలేకపోతుంది: మంత్రి సీతక్క
హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని కాంగ్రెస్ సర్కార్ కోరుకుంటే బీఆర్ఎస్ ఏడుస్తోందని మంత్రి సీతక్క విమర్శించారు. మహిళలు ఎదిగితే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొస్తే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. మంగళవారం (జూన్ 9) సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ప్రభుత్వం మహిళా శక్తి సభ నిర్వహించింది.
మంత్రి సీతక్క ఈ సభకు హాజరై ప్రసగించారు. రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రూ.61 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలిపారు. రూ.2 వేల కోట్ల వడ్డీ డబ్బులను ప్రభుత్వమే చెల్లింస్తుదని చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఉపాధి కల్పిస్తున్నామన్నారు.